Home » Elections
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బీజేడీ పార్టీ అధికారంలోకి రాగానే ఒడిశా ప్రజలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. నవీన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే.. ఈ ఉచిత విద్యుత్పై తొలి ఉత్తర్వులు జారీ చేస్తారని పేర్కొంది.
ఏపీలో పోలింగ్ ముగిసింది. గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ పార్టీలు తమకు వచ్చే సీట్లపై లెక్కలు వేసుకున్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలమని ఓవైపు ఎన్డీయే కూటమి అంచనా వేస్తుంటే.. మరోవైపు వైసీపీ సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటింగ్ జరిగిందని లెక్కలు వేస్తున్నారు. పార్టీల అంచనాలు ఇలా ఉంటే.. బెట్టింగ్ రాయుళ్ళ అంచనా మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఏలూరు: నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకం సృష్టించారు. 40వ డివిజన్లో టీడీపీ వర్గీయులపై దాడి చేశారు. తెలుగుదేశం సానుభూతి పరుడు చీపుర్లు గణేష్పై కోడి కత్తితో వైసీపీ దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో గణేష్ గొంతు వద్ద తీవ్ర గాయమైంది.
ఏపీలో పోలింగ్ ముగిసింది. జనం తమ తీర్పును ఈవీఎంలలో బంధించారు. దీంతో రాజకీయ పార్టీలు, నేతల్లో టెన్షన్ కొనసాగుతుండగా.. ఓటరు మాత్రం కూల్ అయిపోయాడు. తాను ఎలాంటి తీర్పు ఇవ్వాలనుకున్నాడో పోలింగ్ బూత్కు వెళ్లి తన తీర్పును రిజర్వు చేసి వచ్చాడు. జూన్4న అసలు తీర్పు వెల్లడికానుంది. ఓటరు ఏ పార్టీని ఆదరించాడనేది మరో 20 రోజుల్లో తెలుస్తుంది. అప్పటివరకు నాయకుల్లో టెన్షన్ కొనసాగనుంది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎం మెషిన్లలో లాక్ అయింది. జూన్4 ఓట్ల లెక్కింపుతో గెలిచేదెవరో తేలిపోనుంది. పోలింగ్ వేళ కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అధికార వైసీపీకి చెందిన నాయకులే ప్రత్యర్థులపై దాడికి దిగారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఓటమి భయంతో పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా ఉండేందుకు దాడులకు పాల్పడ్డారని విమర్శిస్తున్నారు. మరోవైపు వైసీపీ మాత్రం టీడీపీనే ఘటనలకు కారణమని ఆరోపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముగిసింది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగ్గా.. రాష్ట్రవ్యాప్తంగా 79.04 శాతం పోలింగ్ నమోదైంది. కొన్ని నియోజకవర్గాల్లో అర్థరాత్రి దాటిన తర్వాత పోలింగ్ జరిగిన నేపథ్యంలో ఈ పోలింగ్ శాతం ఒకటి నుంచి రెండు శాతం మధ్యలో పెరిగే అవకాశం ఉండొచ్చు. ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా ధర్మవరం నియోజకవర్గంలో 88.61 శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికలంటే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద పెండుగ. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు ద్వారా పాలకులను ఎన్నుకుంటారు. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలు భారత్కు ఎంతో ప్రత్యేకం. ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఎలాంటి వ్యక్తి అయినా పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వెయ్యాలి. వయో వృద్ధులు, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది మాత్రం ముందుగానే పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేయ్యొచ్చు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా దేశంలో నాలుగో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. పోలింగ్లో ఓటింగ్ శాతం పెంచేందుకు భారత ఎన్నికల సంఘం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆంధ్రజ్యోతి తనవంతు ప్రయత్నం చేస్తూ వస్తుంది.
అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి మొత్తం 15మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో ప్రధానపార్టీలకు చెందిన అభ్యర్థులు నలుగురు కాగా.. మిగతా అభ్యర్థులంతా రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు.