Share News

Delhi : సెలవు కోసం ఢిల్లీలో 5 ఏళ్ల బాలుడి హత్య

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:01 AM

ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బ్రిజ్‌పూరి మదర్సాలో శుక్రవారం రాత్రి జరిగింది.

Delhi : సెలవు కోసం ఢిల్లీలో 5 ఏళ్ల బాలుడి హత్య

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బ్రిజ్‌పూరి మదర్సాలో శుక్రవారం రాత్రి జరిగింది. బాలుడి హత్య కేసులో ఇద్దరు 9 ఏళ్ల చిన్నారులు, 11 ఏళ్ల బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

మదర్సాలో ఓ విద్యార్థి చనిపోయాడని శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పోలీసులకు సమాచారం వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే మదర్సాలోని ముగ్గురు చిన్నారులు హత్య చేసినట్లు గుర్తించారు.

నిందితులను పోలీసులు ప్రశ్నించగా.. మమ్మల్ని అసభ్య పదజాలంతో దూషించేవాడని, అతన్ని చంపితే మదర్సాకు ఒక రోజు సెలవు ఇస్తారని అందుకే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.

Updated Date - Aug 25 , 2024 | 04:01 AM