Share News

Delhi : ధన్‌ఖడ్‌పై అభిశంసన తీర్మానం?

ABN , Publish Date - Aug 11 , 2024 | 04:17 AM

రాజ్యసభ చైర్మన్‌గా జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించడం కోసం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రాజ్యసభలో నోటీసు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నాయి.

Delhi : ధన్‌ఖడ్‌పై అభిశంసన తీర్మానం?

  • నోటీసు ఇచ్చే యోచనలో ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ, ఆగస్టు 10: రాజ్యసభ చైర్మన్‌గా జగదీప్‌ ధన్‌ఖడ్‌ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విపక్షాలు ఆయన్ను ఉపరాష్ట్రపతి పదవి నుంచి తొలగించడం కోసం అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు రాజ్యసభలో నోటీసు ఇచ్చే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాజ్యసభ పక్ష నేత జేపీ నడ్డాకు సమాచారం ఇచ్చినట్లు ఇండియా కూటమి ఎంపీ ఒకరు తెలిపారు.

అయితే ఈ నోటీసును ఎప్పుడు సమర్పించాలనే దానిపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ధన్‌ఖడ్‌కు వ్యతిరేకంగా నోటీసు ఇచ్చే ప్రతిపాదనపై ఇప్పటికే 87 మంది ఎంపీలు సంతకాలు చేసినట్లు తెలిసింది.

Updated Date - Aug 11 , 2024 | 04:17 AM