Share News

Hyderabad: ముంబై-హైదరాబాద్.. మధ్యలోనే కుప్పకూలిన హెలికాప్టర్..

ABN , Publish Date - Aug 24 , 2024 | 03:54 PM

Helicopter Crashed: మహారాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వస్తూ ఓ హెలికాప్టర్ మార్గమధ్యలోనే కుప్పకూలిపోయింది. హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి పరిస్థితి ఏంటనేది మాత్రం సమాచారం లేదు.

Hyderabad: ముంబై-హైదరాబాద్.. మధ్యలోనే కుప్పకూలిన హెలికాప్టర్..
Helicopter Crashed

Helicopter Crashed: మహారాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వస్తూ ఓ హెలికాప్టర్ మార్గమధ్యలోనే కుప్పకూలిపోయింది. హెలికాప్టర్‌లో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి పరిస్థితి ఏంటనేది మాత్రం సమాచారం లేదు. ఘటనపై పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వివరాలు వెల్లడించారు. పూణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయినట్లు తెలిపారు. ఈ హెలికాప్టర్ ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తోందని.. ఇందులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు.


గాయాలతో బయటపడ్డ బాధితులు..

గ్లోబల్ హెక్ట్రా కంపెనీకి చెందిన ఏడబ్ల్యూ 139 హెలికాప్టర్ ముల్షి తాలూకాలోని కొండవాడే గ్రామంలో కూలిపోయింది. ఈ ఘటనలో కెప్టెన్ ఆనంద్ తీవ్రంగా గాయపడగా.. దిర్ భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆనంద్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, ఈ హెలికాప్టర్ జుహు ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తుందని అక్కడి అధికారులు.


Also Read:

ఎన్‌ కన్వెన్షన్ కూల్చివేతలో బిగ్ ట్విస్ట్...

దోమలను చంపే లేజర్ మెషిన్..

డేటింగ్ యాప్‌ స్కాం: అబ్బాయిలే బాధితులు

For More National News and Telugu News..

Updated Date - Aug 24 , 2024 | 04:06 PM