Share News

Jharkhand Assembly Polls: 66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

ABN , Publish Date - Oct 19 , 2024 | 09:04 PM

బీజేపీ తొలి జాబితాలో చోటుచేసుకున్న ప్రముఖుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, జెఎంఎం నుంచి కమలం గూటిలోకి చేరిన మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, సీతా సోరెన్ తదితరులు ఉన్నారు.

Jharkhand Assembly Polls: 66 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా

రాంచీ: జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో (Jharkhand Assembly Elections) పోటీ చేసే 66 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారంనాడు విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ తొలి జాబితాలో చోటుచేసుకున్న ప్రముఖుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, జెఎంఎం నుంచి కమలం గూటిలోకి చేరిన మాజీ ముఖ్యమంత్రి చంపయి సోరెన్, సీతా సోరెన్ తదితరులు ఉన్నారు. ధన్‌వార్ నియోజకవర్గం నుంచి బాబూలాల్ మరాండీ పోటీ చేయనుండగా, సరైకేలా నుంచి చంపయి సోరెన్, జమ్తారా నుంచి సీతా సోరెన్ పోటీ చేస్తు్న్నారు. ఇతర ప్రముఖుల్లో కోడెర్మా నుంచి నారా యాదవ్, గాండే నుంచి మునియా దేవి, సింద్రి నుంచి తారాదేవి, నిర్సా నుంచి అపర్ణా సేన్‌గుప్తా పోటీలో ఉన్నారు. ఝరియా నుంచి రాగిణి సింగ్, ఛాతర్‌పూర్ నుంచి దేవి భూయాన్ తదితరులు పోటీ చేస్తున్నారు.

Jharkhand Elections: ఎన్నికల వేళ ఈసీఐ సంచలన నిర్ణయం.. డీజీపీ తొలగింపునకు ఆదేశం


సీట్ షేరింగ్ ఫార్మూలా..

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సీట్ల షేరింగ్ ఫార్ములాను ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ 68 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఆల్ జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) 10 సీట్లలోనూ, జేడీ(యూ) 2, లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) ఒక స్థానంలోనూ పోటీ చేస్తున్నాయి. 2019 జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి 47 సీట్లు గెలుచుకుంది. జేఎఎం 30 సీట్లు, భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ 16 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందింది. కాగా, ఈసారి రెండు విడతలుగా జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న తొలివిడత, నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఈ పథకం కింద రూ. 15 లక్షల సాయం

Updated Date - Oct 19 , 2024 | 09:09 PM