Share News

Himachal Pradesh: ప్రచారంలో నోరుజారిన కంగనా

ABN , Publish Date - May 06 , 2024 | 04:12 AM

కంగనా రనౌత్‌ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా పప్పులో కాలేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై నోరుజారారు.

Himachal Pradesh: ప్రచారంలో నోరుజారిన కంగనా

న్యూఢిల్లీ, మే 5: కంగనా రనౌత్‌ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా పప్పులో కాలేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై నోరుజారారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన కంగనా శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘చెడిపోయిన రాకుమారుల పార్టీ ఒకటి ఉంది. అది చంద్రుడిపై బంగాళదుంపలు పండిచాలనుకునే రాహుల్‌ గాంధీ కావొచ్చు లేదా గుండాయిజం చేసి చేపలు తినే తేజస్వి సూర్య కావొచ్చు’’ అని అన్నారు. తేజస్వి యాదవ్‌ చేపలు తింటుండగా తీసిన ఓ వీడియోను ఉద్దేశించి కంగనా ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - May 06 , 2024 | 04:12 AM