Share News

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:14 AM

న్యూఢిల్లీ నుంచి బిహార్‌లోని ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

పట్నా, సెప్టెంబరు 8: న్యూఢిల్లీ నుంచి బిహార్‌లోని ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఎస్‌6-ఎ్‌స7ల బోగీల మధ్య ఉన్న కప్లింగ్‌ తెగిపోవడమే ఇందుకు కారణం. వెనుక నుంచి ఆ లైనులో ఇతర రైలు ఏదీ రాకపోవడం, ప్రయాణికులెవరికీ ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆదివారం ఉదయం 11.08 గంటలకు బక్సర్‌ జిల్లాలోని ట్వైనింగ్‌ గంజ్‌-రఘునాథ్‌పూర్‌ స్టేషన్ల మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే సాంకేతిక సిబ్బంది రంగంలో దిగి దానికి మరమ్మతు చేయడంతో 2.25 గంటలకు రైలు తిరిగి బయలుదేరింది.

Updated Date - Sep 09 , 2024 | 04:14 AM