Share News

Nikhil: సినిమాలకు గుడ్‌బై.. ఇక పూర్తిగా రాజకీయాలకే..

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:09 PM

ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్‌ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్‌ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు.

Nikhil: సినిమాలకు గుడ్‌బై.. ఇక పూర్తిగా రాజకీయాలకే..

- నిఖిల్‌ కుమారస్వామి

బెంగళూరు: ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్‌ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్‌ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు. కుమారస్వామిపై మండ్య ప్రజలు చూపిన గౌరవం, ప్రేమ అభిమానాలను కాపాడుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలన్నది కుమారస్వామి ఆశయమన్నారు.

ఇదికూడా చదవండి: Deputy CM: నిజం ఒప్పేసుకున్నారు.. అక్కడ ఓటమికి బాధ్యత నాదే..


దూరదృష్టి ఉన్నందునే బీజేపీతో కలసి ముందుకెళ్లామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ విమర్శలకు మండ్య(Mandya) ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. కుమారస్వామి కేంద్రంలో మంత్రి పదవి కోరేది ఉండదని, కానీ సీనియారిటీ ప్రకారం అవకాశం దక్కుతుందన్నారు. ఇకపై పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రమంతా తిరుగుతా అన్నారు. రాష్ట్రానికి కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన సేవలు అపారమన్నారు. అన్నివర్గాల ప్రజలు కుమారస్వామికి ఆశీస్సులు అందించారని తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 08 , 2024 | 01:12 PM