Home » Kumara swamy
Kumaraswamy: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మళ్లీ నెంబర్ వన్ చేయడంలో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. రెండు, మూడు నెలల్లో కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపుతామని చెప్పారు. ఈ వార్షిక ఏడాదికి పూర్తిస్థాయిలో ఉక్కు ఉత్పత్తి సాధన లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు.
Central Ministers: విశాఖ ఎయిర్పోర్టులో కేంద్రమంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. కాసేపట్లో స్టీల్ ప్లాంట్కు కేంద్రమంత్రులు చేరుకోనున్నారు. స్టీల్ప్లాంట్ పరిపాలన భవనం వద్దకు చేరుకోనున్న కేంద్రమంత్రులు అక్కడ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకుంటామనే దానిపై కేంద్రమంత్రులు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విపక్షాలంటే కేవలం ఆరోపణలు చేయడం కాదని, వాటిని రుజువు చేయాలని కర్ణాటక ముఖ్మమంత్రి సిద్ధరామయ్య కేంద్ర మంత్రి కుమారస్వామిని నిలదీశారు.
చెన్నపట్టణ ఉప ఎన్నిక కోసం రూ.50 కోట్లు డిమాండ్ చేశారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ తాతా చేసిన ఫిర్యాదు వివాదం మలుపులు తిరుగుతోంది.
కేంద్ర మంత్రి కుమారస్వామి తనను రూ.50 కోట్లు అడిగారని బెంగళూరుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి విజయ్టాటా సంచలన ఆరోపణలు చేశారు.
కర్ణాటకలోని మాండ్య జిల్లాలో నాగమంగళ పట్టణంలో వినాయకుడి ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. అనంతరం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఎస్ఐపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటనకు సంబంధించి 55 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలోని ఏడు విమానాశ్రయాలను 14కు పెంచే ఆలోచన ఉందని కేంద్ర విమానయాన మంత్రి కె. రామ్మోహన్నాయుడు అన్నారు. ఈ ఉద్దేశంతోనే ఎయిర్పోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.
కర్ణాటక - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఎల్లప్పుడూ సుహృద్భావ వాతావరణం ఉంటుందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల అధికారులు, పాలకులు కూడా కలిసి పని చేస్తే చాలా సమస్యలు తీరుతాయని తెలిపారు. అటవీ శాఖపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి సమావేశంలో ఏడు ప్రత్యేకమైన అంశాలు చర్చకు వచ్చాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప ఎటువంటి సాయం చేస్తారనే విషయం వెల్లడించడం లేదు.
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీలో జరిగిన అవినీతిలో సీఎం సిద్దరామయ్య కుటుంబ భాగస్వామ్యం, వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్ గ్రాంట్లు బినామీ ఖాతాలకు ....