Share News

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

ABN , Publish Date - Jun 18 , 2024 | 01:56 PM

ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషన్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు.

Varanasi: నేడు సొంత నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటన

వారణాసి, జూన్ 18: ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రోజు వారణాసిలో పర్యటించనున్నారు. ఈ పర్యాటనలో భాగంగా సాయంత్రం 4.00 గంటలకు లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు ఆయన చేరుకుంటారు. అనంతరం వారణాసిలో ఏర్పాటు చేసిన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద లబ్దిదారులకు 17 విడత నిధులను ఆయన విడుదల చేయనున్నారు.


అలాగే స్వయం సహాయక బృందాల్లోని మహిళలకు సర్టిఫికేట్లను అందజేయనున్నారు. రాత్రి ఏడుగంటలకు దశాశ్వమేథా ఘాట్‌లో నిర్వహించే గంగా హారతికి మోదీ హాజరుకానున్నారు. అ తర్వాత కాశీ విశ్వనాథుడి ఆలయానికి చేరుకొని.. పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం మోదీ.. రాత్రికి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

Also Read: Odisha: బాలాసోర్‌లో ఉద్రిక్తత.. కర్ఫ్యూ విధింపు


మరోవైపు వారణాసి ఎంపీగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. అలాగే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను స్వాగతించేందుకు బీజేపీ కేడర్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఇంకోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో వారణాసిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jun 18 , 2024 | 02:03 PM