Share News

Pune : పరారీలో ట్రైనీ ఐఏఎస్‌ పూజా తల్లిదండ్రులు

ABN , Publish Date - Jul 16 , 2024 | 03:21 AM

వివాదస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. భూ వివాదంలో కొందరిని ఆయుధాలతో బెదిరించిన కేసులో పూజా తల్లి మనోరమా ఖేద్కర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Pune : పరారీలో ట్రైనీ ఐఏఎస్‌ పూజా తల్లిదండ్రులు

పుణె, జూలై 15: వివాదస్పద ట్రైనీ ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారు. భూ వివాదంలో కొందరిని ఆయుధాలతో బెదిరించిన కేసులో పూజా తల్లి మనోరమా ఖేద్కర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బనెర్‌ రోడ్డులోని బంగ్లాలో మనోరమా ఉందని భావించిన పోలీసు బృందం అక్కడ వెళ్లినా ఆమెను కనుగొనలేకపోయింది.

ఒక భూ వివాదంలో తుపాకీతో కొందరిని మనోరమ బెదిరిస్తున్న వీడియో ఒకటి వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఇక సివిల్‌ సర్వీసె్‌సలో అర్హత సాధించేందుకు పూజా ఖేద్కర్‌ అంగవైకల్యం లేకున్నా ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం పొందేందుకు ప్రయత్నించినట్లు వెలుగులోకి వచ్చింది. 2022, ఆగస్టులో ఆమె పుణెలోని అంధ్‌ ఆసుపత్రిని సంప్రదించి డిజెబిలిటీ సర్టిఫికెట్‌ ఇవ్వాలని కోరగా వైద్యులు నిరాకరించారు.

Updated Date - Jul 16 , 2024 | 03:21 AM