Home » Police case
గోళ్లు పెద్దవిగా పెంచుతున్నారా.. స్టైల్గా ఉందిలే అనుకుంటున్నారా.. జర జాగ్రత్త మీ గోళ్ల కారణంగా ఎవరైనా గాయపడితే చట్ట ప్రకారం మీరు శిక్షార్హులవుతారు. ఎవరైనా వ్యక్తులు తమపై ఇతర వ్యక్తులు తమ గోళ్లతో దాడి చేశారని ఫిర్యాదు చేస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తారు.
మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గోరంట్ల మాధవ్పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదు అయింది. ఐటీ విద్య శాఖల మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గోరంట్లకు నోటీసులు ఇచ్చే అవకాశముంది.
అమెరికాలోని లాస్ఏంజిలెస్లో అక్కడి అధికారుల నుంచి రాణాను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని పాలం ఎయిర్వేస్లో విమానం ల్యాండ్ అయింది. అక్కడే రాణాను లాంఛనంగా అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్ఐఏ కోర్టుకు తరలించారు.
కర్నాటక రాష్ట్రంలోని దండేలి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా ఉన్న రూ. 5 వందల నోట్ల కరెన్సీ, నోట్లు లెక్కింపు యంత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేపి దర్యాప్తు చేపట్టారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్పై తెలుగుదేశం అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ.. కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
అక్రమ క్వార్ట్జ్ తవ్వకాలు, భారీ ఎత్తున పేలుడు పదార్ధాల వినియోగం, రవాణాపై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విదేశాలకు రూ.250 కోట్లకి పైగా విలువ చేసే క్వార్ట్జ్, పల్సపర్ను కాకాణి అండ్ బ్యాచ్ ఎగుమతి చేశారు. విదేశాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీపై పోలీసులు పూర్తిస్థాయిలో అరా తీస్తున్నారు. పేలుడు పదార్ధాల సరఫరా చేసిన కంపెనీలు, కొనుగోలు చేసిన వ్యక్తులు, వినియోగంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నగేష్ను బంధువులు మంగళవారం రాత్రి జామీను మీద బయటికి తీసుకొచ్చారు. అయితే..
వైసీపీ హయాంలో మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్రెడ్డికి సిట్ మూడోసారి నోటీసు జారీ చేసింది. మద్యం షాపులకు సరఫరా, లంచాల నెట్వర్క్ నిర్వహణలో కీలకంగా ఉన్నాడని ఆధారాలు లభించాయి. దీంతో బుధవారం విచారణకు రావాలంటూ సెట్ అధికారులు నోటీసు ఇచ్చారు.
వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వంశీని జైలుకు తరలించనున్నారు.