Share News

Rahul Gandhi: పరువు నష్టం దావాలో రాహుల్‌కు సమన్లు

ABN , Publish Date - Oct 05 , 2024 | 05:02 AM

క్రిమినల్‌ పరువు నష్టం దావా విషయమై ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని పుణె మేజిస్ట్రేటు కోర్టు శుక్రవారం కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి సమన్లు పంపించింది.

Rahul Gandhi: పరువు నష్టం దావాలో రాహుల్‌కు సమన్లు

ముంబై, అక్టోబరు 4: క్రిమినల్‌ పరువు నష్టం దావా విషయమై ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని పుణె మేజిస్ట్రేటు కోర్టు శుక్రవారం కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి సమన్లు పంపించింది. గత ఏడాది లండన్‌లో స్వాతంత్య్ర సమర యోధుడు సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై కేసు నమోదయింది.


సావర్కర్‌ సోదరుడి మనుమడు సాత్యకి సావర్కర్‌ గత ఏడాది ఏప్రిల్‌లో ఈ కేసు పెట్టారు. ప్రతి సందర్భంలోనూ సావర్కర్‌ను అవమాన పరిచేలా రాహుల్‌ విమర్శలు చేస్తున్నారని సాత్యకి ఆరోపించారు. దీంతో తమ కుటుంబం మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయమై దాఖలైన మరో దావాలో ఇటీవలే నాసిక్‌ కోర్టు కూడా రాహుల్‌కు సమన్లు పంపింది.

Updated Date - Oct 05 , 2024 | 05:02 AM