Share News

ఇండియా కూటమిలోనే ఉంటాం: ఉద్ధవ్‌ శివసేన

ABN , Publish Date - Jun 07 , 2024 | 04:02 AM

ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన త్వరలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని వస్తున్న వదంతులపై ఆ పార్టీ ఖండించింది. తాము ఇండియా కూటమిలోనే కొనసాగనున్నామని స్పష్టం చేసింది. శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ గురువారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ..

ఇండియా కూటమిలోనే ఉంటాం: ఉద్ధవ్‌ శివసేన

న్యూఢిల్లీ, జూన్‌ 6: ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన త్వరలో ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమవుతోందని వస్తున్న వదంతులపై ఆ పార్టీ ఖండించింది.తాము ఇండియా కూటమిలోనే కొనసాగనున్నామని స్పష్టం చేసింది. శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ ప్రియాంకా చతుర్వేదీ గురువారం ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకి రాబోతోందని ఫలితాలకు ముందు ఊదరగొట్టిన కొందరు విలేకరులు.. వారి అంచనాలు తలకిందులయ్యేసరికి ఇప్పుడు ఇలాంటి వదంతులు పుట్టిస్తున్నారని పేర్కొన్నారు. తాము ఇండియా కూటమిలోనే ఉండనున్నామని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - Jun 07 , 2024 | 07:15 AM