TG: గవర్నర్‌తో స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ..

ABN, Publish Date - Jul 02 , 2024 | 01:48 PM

హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్‌లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ రాధా కృష్ణన్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి మర్యాదపూర్వకంగా కలిసి.. భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

TG: గవర్నర్‌తో  స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ.. 1/5

గవర్నర్ రాధా కృష్ణన్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి భేటీ అయ్యారు.

TG: గవర్నర్‌తో  స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ.. 2/5

గవర్నర్ రాధా కృష్ణన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్) శాంతి కుమారి భేటీ అయిన దృశ్యం.

TG: గవర్నర్‌తో  స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ.. 3/5

స్పీకర్ గడ్డం ప్రసాద్ రాష్ట్ర గవర్నర్ రాధా కృష్ణన్‌ను కలిసిన సందర్బంగా శాలువ కప్పి పుష్పగుచ్చములిస్తున్న దృశ్యం.. ప్రక్కన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

TG: గవర్నర్‌తో  స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ.. 4/5

గవర్నర్ రాధా కృష్ణన్‌ను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాలువ కప్పి సత్కరించారు.

TG: గవర్నర్‌తో  స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ.. 5/5

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ( సీఎస్) శాంతి కుమారి రాజ్‌భవన్‌లో గవర్నర్ రాధా కృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేస్తున్న దృశ్యం.

Updated at - Jul 02 , 2024 | 01:54 PM