TG: గవర్నర్తో స్పీకర్, మండలి ఛైర్మన్, సీఎస్ భేటీ..
ABN, Publish Date - Jul 02 , 2024 | 01:48 PM
హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వ్యవహారం కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ నెల 5వ తేదీ నుంచి ఆషాఢమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. కేబినెట్లో కొత్తగా ఎవరెవరికి చోటు కల్పించాలనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ రాధా కృష్ణన్తో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి మర్యాదపూర్వకంగా కలిసి.. భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Updated at - Jul 02 , 2024 | 01:54 PM