Share News

Viral: ఐదుగురు పిల్లల్ని వదిలి ప్రియుడితో మహిళ జంప్.. భర్త వేసిన స్కెచ్ తెలిస్తే మైండ్‌బ్లాక్

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:27 PM

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు.. ఈమధ్య కొందరు వివాహితులు తప్పుదారి పడుతున్నారు. ఇంట్లో భర్త ఉన్నప్పటికీ.. పరాయి మగాళ్లపై మోజు పెంచుకుంటున్నారు. చివరికి తాము..

Viral: ఐదుగురు పిల్లల్ని వదిలి ప్రియుడితో మహిళ జంప్.. భర్త వేసిన స్కెచ్ తెలిస్తే మైండ్‌బ్లాక్
Extramarital Affair

పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు.. ఈమధ్య కొందరు వివాహితులు తప్పుదారి పడుతున్నారు. ఇంట్లో భర్త ఉన్నప్పటికీ.. పరాయి మగాళ్లపై మోజు పెంచుకుంటున్నారు. చివరికి కన్న పిల్లలను సైతం వదిలేసి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు ఓ మహిళ కూడా అదే పని చేసింది. ఐదుగురు చిన్నారుల్ని వదిలేసి.. ప్రియుడితో పారిపోయింది. దీంతో కోపాద్రిక్తుడైన ఓ భర్త.. పెద్ద స్కెచ్ వేశాడు. చివరకు.. తాను ఏదో తలిస్తే ఇంకేదో అయ్యింది. తానే చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


Read Also: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. గంభీర్ ట్వీట్ వైరల్

నరైనీ కొత్వాలిలోని కర్తాల్ చౌకీ ప్రాంతానికి చెందిన లల్లూకి కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళతో వివాహమైంది. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. అయితే.. కొంతకాలం నుంచి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వీళ్లిద్దరు తరచుగా కలుసుకునేవాళ్లు. ఓసారి వీరి బండారం భర్తకు తెలియడంతో.. ఇద్దరినీ నిలదీశాడు. ఇంకోసారి కలిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు. దీంతో.. భార్య తన ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ప్లాన్ ప్రకారం.. ఇంట్లో అందరూ నిద్రపోయినప్పుడు, తట్టాబుట్టా సర్దేసుకొని ఆమె వెళ్లిపోయింది. అదే రాత్రి 2 గంటల సమయంలో భర్తకు మెలుకువ వచ్చి చూడగా.. ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో.. ప్రియుడితోనే వెళ్లిపోయిందని నిర్ధారించుకున్నాడు.


Read Also: హైహీల్స్‌తో వ్యవసాయం.. ఈ ట్రిక్ మామూలుగా లేదుగా..

ఆ కోపంలో లల్లూ తన ఇంటికి నిప్పంటించాడు. ఇంట్లో తన తల్లితో పాటు ఐదుగురు పిల్లలున్నా పట్టించుకోకుండా.. ఆగ్రహంలో నిప్పు పెట్టాడు. ఇది గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, అతికష్టం మీద మంటల్ని ఆర్పి, ఇంట్లో ఉన్న పిల్లలతో పాటు లల్లూ తల్లిని కాపాడారు. ఇంటికి ఎవరు నిప్పు పెట్టారని ప్రశ్నించగా.. లల్లూ అప్పుడు ఓ కథ అల్లేశాడు. పక్కూరికి చెందిన ఓ వ్యక్తి తన భార్యను వెంట తీసుకెళ్లాడని.. వెళ్తూ వెళ్తూ ఇంటికి నిప్పంటించాడని చెప్పాడు. ఇది నిజమా? కాదా? అని కన్ఫమ్ చేసుకోవడం కోసం పోలీసులు ఇరుగుపొరుగు వారిని ప్రశ్నించారు. ఇంటికి ఎవరూ రాలేదని, లల్లూ మంటలను ఆర్పకుండా మంచం మీద పడుకొని ఉన్నాడని వాళ్లు చెప్పారు.


దీంతో.. పోలీసులు లల్లూని అదుపులోకి తీసుకొని, తమదైన శైలిలో విచారించారు. అసలేం జరిగిందో నిజం చెప్పకపోతే బడితపూజ చేస్తామని హెచ్చరించారు. ఆ దెబ్బకు అతను భయపడిపోయి మొత్తం నిజం కక్కేశాడు. తన భార్య పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అతనితో ఆమె పారిపోయిందని చెప్పాడు. ఆ కోపంలోనే తాను ఇంటికి నిప్పంటించానని పేర్కొన్నాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుని తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. తాము సమయానికి సంఘటనా స్థలానికి చేరుకోవడం వల్ల మంటల్ని ఆర్పగలిగామని.. లేకుండా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Jul 20 , 2024 | 05:27 PM