Share News

పాలనలో సంస్కరణలు తెచ్చింది చంద్రబాబే

ABN , Publish Date - Sep 02 , 2024 | 04:35 AM

తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.

పాలనలో సంస్కరణలు తెచ్చింది చంద్రబాబే

  • టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని

హైదరాబాద్‌, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుదేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. ప్రజలవద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం వంటి వినూత్న కార్యక్రమాలతోపాటు పాలనలో ఎన్నో సంస్కరణలు తెచ్చారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు మూలం చంద్రబాబేనని తెలిపారు. చంద్రబాబు తొలిసారి సీఎంగా (1995 సెప్టెంబరు1న) ప్రమాణస్వీకారం చేసి 30వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా టీటీడీపీ నేతలు ఆదివారం ఎన్టీఆర్‌ భవన్‌లో కేక్‌ కట్‌చేసి వేడుకలు జరుపుకొన్నారు. పార్టీజాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, సీనియర్‌ నేత సామ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2024 | 04:35 AM