Share News

అందుకే మేం ఇక్కడ కూర్చున్నాం: కొత్త

ABN , Publish Date - Jul 31 , 2024 | 04:18 AM

రాష్ట్రంలో పంచాయతీలకు సరిపడా నిధులు ఇవ్వడంలేదని, దాంతో పల్లెలు ఏడుస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

అందుకే మేం ఇక్కడ కూర్చున్నాం: కొత్త

రాష్ట్రంలో పంచాయతీలకు సరిపడా నిధులు ఇవ్వడంలేదని, దాంతో పల్లెలు ఏడుస్తున్నాయని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా, కొన్నింటికే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిధులన్నీ నాలుగు నియోజకవర్గాలకే వెళ్లాయన్నారు. ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ అప్పుడు తాము అలా చేశాం కాబట్టే ఇప్పుడు ఇక్కడ(ప్రతిపక్షంలో) కూర్చున్నామన్నారు. దాంతో బీఆర్‌ఎస్‌ సభ్యులు ఆయనవైపు చూశారు.

Updated Date - Jul 31 , 2024 | 04:18 AM