Share News

MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చిత్రీకరణ

ABN , Publish Date - Oct 21 , 2024 | 05:06 AM

తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

MLA Kaushik Reddy: గుట్టపై ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చిత్రీకరణ

  • కుటుంబసభ్యులతో రీల్స్‌... ఎక్స్‌లో పోస్ట్‌!

  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు

భువనగిరి అర్బన్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఇలవేల్పుగా వెలుగొందుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రీల్స్‌ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి భార్య శాలిని పుట్టినరోజును పురస్కరించుకుని కుమార్తె శ్రీనికతో కలిసి చేసిన రీల్స్‌ వీడియో, ఫొటోలు ఆయన ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేయడంతో విషయం వెలుగుచూసింది.


అవి ఈ నెల 7వ తేదీన ఆయన స్వామివారి దర్శనార్థం యాదగిరిగుట్టకు వచ్చిన సందర్భంగా ఆలయ ఆవరణలో తీసిన ఫొటోలేనని, అవి తీయడం సంప్రదాయానికి విరుద్ధమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్‌ చేసేందుకు ఆలయ సందర్శనకు వచ్చారని, భక్తుల సంచారం లేనిచోట వీడియో, ఫొటోలు తీయడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు.

Updated Date - Oct 21 , 2024 | 05:06 AM