Home » Kaushik Reddy
అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వంపై నిందలు మోపే కార్యక్రమానికి ఇకనైనా స్వస్తి పలకాలని కౌశిక్రెడ్డికి సూచించారు.
మంత్రి సీతక్క జీవన విధానం మారిందని, ఆమె ఇప్పుడు ఐదు ఎకరాల విశాల భవనంలో ఉంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.
Minister Seethakka: రైతు బోనస్ ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వ బోగస్ చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. వరి వేస్తే ఉరి అన్నది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని మంత్రి సీతక్క ప్రకటించారు.
సభలో కౌషిక్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం దాటినా ఆరు పథకాలు, 66 హామీలను నెరవేర్చకపోవడంతో పాటు కాలయాపన చేస్తోందని అన్నారు.
Kaushik Reddy: మాసబ్ ట్యాంక్ పోలీసుల విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు అడిగిన 32 ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి ఆరోపించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి మంగళవారం ఉదయం బెయిల్ మంజూరైంది. ఆయనను కరీంనగర్ పోలీసులు సోమవారం రాత్రి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్నారు.
Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా ముందుస్తుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్రెడ్డిపై ఆది, సోమవారాల్లో నాలుగు కేసులు నమోదయ్యాయి.
కరీంనగర్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పండుగపూట బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ వన్ టౌన్ పీఎస్లో ఈ కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ ఆర్డివో, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏల ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ యాక్టు 132, 115 (2), 352, 292 కింద కేసులు నమోదు అయ్యాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రె్సలో చేరిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ మధ్య వాగ్వాదం, తోపులాటతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక సమీక్షా సమావేశం రసాభాసగా మారింది.