Donation: విజయవాడ వరద బాధితులకు జీవీపీఆర్ ఇంజనీర్స్ రూ. కోటి విరాళం
ABN , Publish Date - Sep 13 , 2024 | 03:29 AM
విజయవాడ వరద బాధితుల సహాయార్థం జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ రూ. కోటి విరాళాన్ని అందించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడ వరద బాధితుల సహాయార్థం జీవీపీఆర్ ఇంజనీర్స్ లిమిటెడ్ రూ. కోటి విరాళాన్ని అందించింది. సంస్థ చైర్మన్ జీఎ్సపి. వీరారెడ్డి, ఎండీ శేఖర్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని హైదరాబాద్లో కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. వరద బాధితులకు భారీ విరాళం అందించినందుకు వారిని చంద్రబాబు అభినందించారు.