Share News

Hyderabad: 127 K రూట్‌లో ఎలక్ర్టికల్‌ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు...

ABN , Publish Date - Jun 25 , 2024 | 10:20 AM

మాదాపూర్‌, హైటెక్‌ సిటీ(Madapur, hi-tech city)లో పనిచేస్తున్న ఐటీ, ఇతర ఉద్యోగుల కోసం 127కె కోఠి-కొండాపూర్‌ రూట్‌లో కొత్తగా ఎలక్ర్టిక్‌ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను(Electric AC Metro Luxury Buses) సోమవారం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Hyderabad: 127 K రూట్‌లో ఎలక్ర్టికల్‌ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు...

హైదరాబాద్‌ సిటీ: మాదాపూర్‌, హైటెక్‌ సిటీ(Madapur, hi-tech city)లో పనిచేస్తున్న ఐటీ, ఇతర ఉద్యోగుల కోసం 127కె కోఠి-కొండాపూర్‌ రూట్‌లో కొత్తగా ఎలక్ర్టిక్‌ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులను(Electric AC Metro Luxury Buses) సోమవారం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు గ్రేటర్‌ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. 127కె రూట్‌ కోఠి నుంచి కొండాపూర్‌(Kondapur)కు వయా కొత్తగూడ ఎక్స్‌రోడ్‌, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌(Hi-Tech City, Madapur), పెద్దమ్మగుడి, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకాపూల్‌ మీదుగా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: అరాచకశక్తులపై తుపాకీ గురి..


కొండాపూర్‌లో మొదటి బస్‌ ఉదయం 5.06 నిమిషాలకు, చివరి బస్సు రాత్రి 10.17 నిమిషాలకు ఉంటుందని, కోఠి నుంచి మొదటి బస్సు ఉదయం 6.16 నిమిషాలకు, చివరి బస్సు రాత్రి 11.27 నిమిషాలకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ 24 నిమిషాలకు ఓ బస్సు ఈ రూట్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 10:20 AM