Share News

Etela Rajender: మూడో సారి మోదీ ప్రధాని అవడం ఖాయం

ABN , Publish Date - Feb 22 , 2024 | 04:53 PM

మూడోసారి కూడా నరేంద్రమోదీ ప్రధాని అవడం ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ... మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇండియాను అవమానించిన అగ్ర రాజ్యాలు ఇప్పుడు మన మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు.

Etela Rajender: మూడో సారి మోదీ ప్రధాని అవడం ఖాయం

ఆదిలాబాద్: మూడోసారి కూడా నరేంద్రమోదీ ప్రధాని అవడం ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ... మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇండియాను అవమానించిన అగ్ర రాజ్యాలు ఇప్పుడు మన మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిని మోదీ సమర్థ వంతంగా ఎదుర్కొన్నారని.. అగ్ర రాజ్యాలన్నీ ఈ విషయంలో చేతులెత్తేసిన సమయంలో ప్రపంచానికి మోదీ అండగా నిలిచారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 04:53 PM