Share News

Konda Surekha: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా..!

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:37 PM

Telangana: ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారంపై మంత్రి కొండాసురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారానికి వెళ్తానని చెప్పుకొచ్చారు.

Konda Surekha: ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా..!

హైదరాబాద్, జనవరి 30: ఏపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచారంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో కాంగ్రెస్ తరఫున ప్రచారానికి వెళ్తానని చెప్పుకొచ్చారు. తాను వైసీపీలో లేనన్న విషయాన్ని సురేఖ గుర్తు చేశారు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమన్నారు. గతంలో హరితహారం పేరిట అనేక అక్రమాలు జరిగాయని.. దీని గురించి చర్చించి మళ్లీ మాట్లాడుతామని తెలిపారు. హరితహారం కొనసాగించాలా..? వద్దా..? అన్నది సీఎం నిర్ణయమన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని మంత్రి సురేఖ ఆరోపించారు.

Updated Date - Jan 30 , 2024 | 03:18 PM