Share News

Minister Konda Surekha: ఏఐసీసీ సూచనలతో లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:40 PM

ఏఐసీసీ అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) తెలిపారు. గురువారం నాడు మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం జరిగిందని తెలిపారు.

Minister Konda Surekha: ఏఐసీసీ సూచనలతో లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తాం

ఢిల్లీ: ఏఐసీసీ అధిష్టానం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) తెలిపారు. గురువారం నాడు మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, లక్షదీప్ రాష్ట్రాలకు సంబంధించిన లోక్‌సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో సమావేశం జరిగిందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోఅనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు చెప్పారు. మెజార్టీ స్థానాల్లో గెలుపొందలని ఖర్గే సూచించారన్నారు. మెజార్టీ స్థానాలు గెలిపించే బాధ్యత కో ఆర్డినేటర్లపై ఉందని ఖర్గే దిశానిర్దేశం చేశారన్నారు. అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహన్నీ లోక్‌సభ ఎన్నికల్లో కూడా కొనసాగించి మెజార్టీ స్థానాల్లో గెలవాలని సూచించినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాలు ఉంటాయని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 08:40 PM