Share News

Ponnam Prabhakar: గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు

ABN , Publish Date - Sep 14 , 2024 | 06:10 PM

గల్ఫ్‌లో ఉన్న వారి కోసం ఈ నెల 20వ తేదీ నుంచి ప్రజా వాణి ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో వంద శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Ponnam Prabhakar: గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు
Minister Ponnam Prabhakar

హైదరాబాద్ ,సెప్టెంబర్ 14: గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంటామని తెలంగాణ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసింది. గల్ఫ్ కార్మికుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో ఈ రోజు సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ వినోద్ పాల్గొని, గల్ఫ్ బాధితులకు సంబంధించిన 5 అంశాల గురించి చర్చించారు.


ALSO READ:CP CV Anand: నిమజ్జనానికి 25వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు: సీపీ సీవీ ఆనంద్..

గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటినీ ఏర్పాటు చేయాలని.. అందులో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను సభ్యులుగా నియమించి, వారి కోసం జీవో విడుదల చేయాలని సూచించారు. హైదరాబాద్ ప్రజా భవన్‌లో ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజావాణిలో గల్ఫ్ కార్మికుల కోసం ‘‘ప్రవాసి ప్రజావాణి’’ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఈ నెల 20 వ తేదీ నుంచి గల్ఫ్ కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.


ALSO READ:Minister: రెచ్చగొట్టే వారిని అణిచివేయండి..

గురుకుల పాఠశాలలు, కళాశాల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు.. వీటిలో చదవాలని అనుకునే వారికి 100 శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 7 డిసెంబర్ 2023 నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గతంలో చనిపోయిన వారి కుటుంబాలకు మానవతా దృక్పథంతో లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఎన్ఆర్‌ఐ సెల్ సూచించింది. దీనిని తెలంగాణ ఏర్పడిన రోజు జూన్ 2 ,2014 లేదా ఏరోజు తీసుకుంటే బాగుంటుందనే దానిపై చర్చించారు.


ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పలు సలహాలు, సూచనలు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ... ఇప్పటికే తన వేములవాడ నియోజకవర్గానికి చెందిన గల్ఫ్‌లో మృతి చెందిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ నుంచి వారికి ఎక్స్‌గ్రేషియా అందజేశామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతు భీమా మాదిరి గల్ఫ్ భీమా ఉండాలని సూచించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో సింగపూర్ , మలేషియా కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ కన్వీనర్ ఇమిగ్రేషన్ 1982 యాక్ట్‌లో గల్ఫ్ దేశాల్లో 18 దేశాలు ఉంటాయని అందులో సింగపూర్ లాంటి దేశాలు కూడా గల్ఫ్ కిందకు వస్తాయని గుర్తుచేశారు.

ALSO READ:Holiday: గుడ్ న్యూస్.. ఆ రోజున సెలవు ప్రకటించిన సర్కార్..

తెలంగాణలో 150 ట్రెడ్ లైసెన్స్ మ్యాన్ పవర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలు ఉన్నాయని సెట్వీన్, టాంటం, న్యాక్ లాంటి వాటిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని.. అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. గల్ఫ్ కార్మికులు చనిపోతే శవం రావడానికి వారం రోజులకు పైగా పడుతుందని.. 48 గంటల్లో చనిపోయిన వ్యక్తి మృతదేహం తెలంగాణకు వచ్చేలా చూడాలని తెలిపారు.


దేశంలో బెస్ట్ గల్ఫ్ పాలసీ కేరళ రాష్ట్రంలో ఉందని అక్కడ ఉన్న దానిని స్టడీ చేయాలని సూచించారు. కేరళలో జీడీపీ ప్రధానంగా గల్ఫ్ కార్మికుల ద్వారా వస్తోందని తెలంగాణ రాష్ట్రంలో కూడా జీడీపీ గల్ఫ్ కార్మికుల ద్వారా అభివృద్ధి జరగాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, రేకులపల్లి భూపతి రెడ్డి , కెఆర్ నాగరాజు , మేడిపల్లి సత్యం, వాకిటి శ్రీహరి ముదిరాజ్ ,సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెలిచాల రాజేందర్ రావు , వినయ్ రెడ్డి ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ వినోద్ , తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి

Telangana: రెచ్చిపోయిన కేటీఆర్.. సీఎం రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

Hyderabad: వామ్మో జ్వరం.. పెరుగుతున్న వైరల్‌ ఫీవర్ల బాధితులు


Updated Date - Sep 14 , 2024 | 06:28 PM