Share News

Drugs Case: ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేస్... 24 మందికి నోటీసులు జారీ

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:07 PM

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘‘ది కేవ్ పబ్’’ డ్రగ్స్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన 24 మందికి సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాల్సిందిగా రాయదుర్గం పోలీసులు ఆదేశించారు.

Drugs Case: ‘ది కేవ్ పబ్’ డ్రగ్స్ కేస్... 24 మందికి నోటీసులు జారీ
Cave Pub drugs case

హైదరాబాద్, జూలై 8: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘‘ది కేవ్ పబ్’’ డ్రగ్స్ కేసులో (Cave Pub drugs case) పోలీసులు (Telangana Police) విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో పట్టుబడిన 24 మందికి సీఆర్పీసీ 41కింద నోటీసులు జారీ చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి విచారణకు హాజరుకావాల్సిందిగా రాయదుర్గం పోలీసులు (Rayadurgam Police) ఆదేశించారు.

Rahul Gandhi: వైఎస్సారే నాకు స్ఫూర్తి.. ఎంతో నేర్చుకున్నా..


మరోవైపు... ఈ కేసుకు సంబంధించి నలుగురు పబ్ ఓనర్లు పరారీలో ఉన్నారు. అలాగే డి.జే గౌరవ్ డ్రగ్స్ లింక్స్‌పై నార్కోటిక్ బ్యూరో ఆరా తీస్తోంది. పబ్‌లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన వారిలో టెక్కీలు, ఆర్టిస్టులు, కాలేజీ విద్యార్థులు ఉన్నారు. పట్టుబడిన 24 మంది గతంలో డ్రగ్స్ తీసుకున్నారా?.. లేదా? అని పోలీసులు వివరాలు తీసుకోనున్నారు. ది కేవ్ పబ్ వ్యవహారంతో నగరంలోని పబ్స్‌పై నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. కచ్చితంగా ప్రతి రోజు ఆకస్మిక తనిఖీలు ఉంటామని పోలీసులు చెబుతున్నారు. ది కేవ్ పబ్‌ను సీజ్ చేసే అవకాశం ఉంది. అలాగే గతంలో కేవ్ పబ్‌లో డ్రగ్స్ పార్టీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పబ్ నిర్వాహకులు దొరికితే పబ్ బండారం బట్టబయలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

AP Free Sand policy: ఉచిత ఇసుక పాలసీపై విడుదల కానీ జీవో..

AP Politics: కొడుకును చూసి తల్లి కన్నీళ్లు.. జగన్ రియాక్షన్ చూడాల్సిందే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 08 , 2024 | 12:10 PM