Share News

TS News: ఇక్ఫాయ్ యూనివర్సిటీ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు

ABN , Publish Date - May 17 , 2024 | 11:03 AM

Telangana: శంకర్‌పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో అనుమానాస్పద రీతిలో యువతి శరీరం కాలిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీలో లా ఫైనల్‌ ఇయర్ చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి యాసిడ్ దాడికి గురైనట్లు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

TS News: ఇక్ఫాయ్ యూనివర్సిటీ ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తు
Ikfai University incident

హైదరాబాద్, మే 17: శంకర్‌పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో (ICFAI University) అనుమానాస్పద రీతిలో యువతి శరీరం కాలిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీలో లా ఫైనల్‌ ఇయర్ చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి యాసిడ్ దాడికి గురైనట్లు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బకెట్‌‌లో యాసిడ్‌ కలిపిన నీరు పోసుకోవడమే ప్రమాదానికి కారణమనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

AP Elections: స్వామి సన్నిధిలో అబద్ధం చెప్పను.. : ఎంపీ రఘురామ


ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా నీటిని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పోలీసులు (Police) పంపించారు. అలాగే యువతి గది బయట ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కాప్స్ పరిశీలించారు. గదిలోకి గత రెండు రోజులుగా ఇతరులెవరూ వెళ్లలేదని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో యువతి ఒంటిపై 40 శాతం కాలిన గాయాలున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మధ్యాహ్నం ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసీ మీడియా సమావేశం నిర్వహించి.. ఈ ఘటనపై మాట్లాడనున్నారు.


ఇవి కూడా చదవండి....

Gold and Silver Price Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

Telangana Politics: బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీ చిచ్చు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 17 , 2024 | 11:07 AM