TS NEWS: పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది: రాంచంద్రు నాయక్
ABN , Publish Date - Feb 26 , 2024 | 07:54 PM
గత పదేళ్లలో కేసీఆర్ అప్రజాస్వామికంగా పరిపాలన సాగించారని ప్రభుత్వ విప్ రాం చంద్రు నాయక్ (Ramchandar Naik) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ... అచ్చంపేటలో మాజీమంత్రి కేటీఆర్ మతి తప్పి మాట్లాడారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని అన్నారు.
హైదరాబాద్: గత పదేళ్లలో కేసీఆర్ అప్రజాస్వామికంగా పరిపాలన సాగించారని ప్రభుత్వ విప్ రాం చంద్రు నాయక్ (Ramchandar Naik) అన్నారు. సోమవారం నాడు అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ... అచ్చంపేటలో మాజీమంత్రి కేటీఆర్ మతి తప్పి మాట్లాడారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారని అన్నారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ టికెట్ కూడా గెలవదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లిలో చిప్పకూడు తినిపిస్తామని రాంచంద్రు నాయక్ హెచ్చరించారు.