Share News

TG News: అర్ధరాత్రి ఆటో ఎక్కిన యువతిపై దారుణం

ABN , Publish Date - Oct 15 , 2024 | 10:52 AM

Telangana: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కానీ అదే ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని సదరు యువతి ఊహించి ఉండదు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. అయితే యువతిపై కన్నేసిన ఆ ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

TG News: అర్ధరాత్రి ఆటో ఎక్కిన యువతిపై దారుణం
Sad insident in Gachibowli

హైదరాబాద్, అక్టోబర్ 15: రాను రాను సమాజంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతోంది. ఒంటరిగా బయటకు వెళ్తే చాలు తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతుందా లేదా అని కుటుంబసభ్యులు ఆందోళన చెందాల్సిన పరిస్థితిలు ఎదురవుతున్నాయి. ఆడపిల్లలు కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతుంటారు. కొన్ని సార్లు ఇంట్లో కూడా యువతులు సేఫ్‌గా ఉండలేని పరిస్థితి. ఇక ఉద్యోగం చేసే ఆడపిల్లల పరిస్థితి మరీ దారుణం. మంచి ఉద్యోగం, జీతం కోసం సొంత ఊరిని, కన్నతల్లిదండ్రులను వదలి సుదూర ప్రాంతాల్లో మహిళలు ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా కొన్ని సార్లు రాత్రి సమయాల్లో కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారు క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయిస్తుంటారు. ఇదే అదునుగా చూసుకుని కొందరు కామాంధులు వారి జీవితాలను నాశనం చేస్తుంటారు. ఉన్నతమైన చదువులు చదివి, మంచి ఉద్యోగం చేస్తున్న ఆడపిల్లలు కొందరు అనుకోని విధంగా వారి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

ABN Group: లక్ష్యంగా హ్యాకర్ల దాడులు



సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని అయిన ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కానీ అదే ఆమె జీవితాన్ని నాశనం చేస్తుందని సదరు యువతి ఊహించి ఉండదు. ఆర్సీపురం నుంచి గచ్చిబౌలి వెళ్లేందుకు యువతి ఆటో ఎక్కింది. అయితే యువతిపై కన్నేసిన ఆ ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడితో పాటు ఇంకో వ్యక్తి కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి ఆటలో ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. మసీద్ బండ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆపై ఆ ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.

DSC 2024: టీచర్ పోస్టింగులు వాయిదా


తనకు జరిగిన అన్యాయంపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో యువతి పేర్కొంది. అత్యాచారం చేసిన అనంతరం ఆటో డ్రైవర్‌తో పాటు అతడి స్నేహితుడు పారిపోయినట్లు తెలిపింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి...

KTR: ఇందిరమ్మ రాజ్యమని దళారుల రాజ్యం తెచ్చారు: కేటీఆర్..

Arrests: వికారాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్టులు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 15 , 2024 | 11:04 AM