Share News

Minister Ponnam: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్

ABN , Publish Date - Mar 15 , 2024 | 01:07 PM

కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డలో రెండే పిల్లర్లు కుంగాయాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

Minister Ponnam: మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి పొన్నం కౌంటర్

కరీంనగర్: బీఆర్ఎస్ అధినేత (BRS Chief), మాజీ ముఖ్యమంత్రి (Ex. CM) కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR)కు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కౌంటర్ (Counter) ఇచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన కరీంనగర్‌ (Karimnagar)లో మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ (Medigadda)లో రెండే పిల్లర్లు కుంగాయాని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘మొన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా.. కాంగ్రెస్ వస్తే..కరువు వస్తుందని అనడం దారుణం.. కేసీఆర్‌కు అవగాహన లేదు.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం.. బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడూ..మా వల్ల కరువు వచ్చింది’’ అని అనడని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project)లో మూడు పిల్లర్ల కింద ఇసుక జారిపోతే బ్రహ్మాండం బద్దలైనట్లు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్​ అన్నారు. కరీంనగర్‌లో బీఆర్‌ఎస్​ కదనభేరీ సభలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Mar 15 , 2024 | 01:08 PM