Share News

Road Accident: సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ABN , Publish Date - Jan 01 , 2024 | 12:16 PM

Telangana: జిల్లాలోని పటాన్‌చెరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident: సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి

సంగారెడ్డి, జనవరి1 : జిల్లాలోని పటాన్‌చెరు పట్టణ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు యువకులు స్కూటీపై వెళ్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు యువకుల్లో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

వీరంతా సుల్తాన్ పూర్ జీఎన్‌టీయూలో చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. మృతులు పాలకుర్తికి చెందిన ఆర్.భరత్ చందర్( 19), జనగామకు చెందిన పి.నితిన్(18)గా గుర్తించారు. అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ఎ.వంశీ(19) తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2024 | 12:17 PM