Share News

Nirmala Jaggarreddy: టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jul 12 , 2024 | 03:38 AM

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా తూర్పు నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని ఐఐసీ భవన్‌కు గురువారం వచ్చిన ఆమె తన చాంబర్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో బాధ్యతల స్వీకరణ పత్రంపై సంతకం చేశారు.

Nirmala Jaggarreddy: టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ

  • పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో సంతకం

  • అభినందించిన మంత్రులు ఉత్తమ్‌, పొన్నం, నాయకులు

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా తూర్పు నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బషీర్‌బాగ్‌లోని ఐఐసీ భవన్‌కు గురువారం వచ్చిన ఆమె తన చాంబర్‌లో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో బాధ్యతల స్వీకరణ పత్రంపై సంతకం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు ఆమెను అభినందించారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సంగారెడ్డి నుంచి తరలి వచ్చిన నేతలు, కార్యకర్తలు, కుటుం బ సభ్యుల అభినందనల మధ్య నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.


మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్‌ తదితరులు ఆమెకు అభినందనలు తెలిపారు.

Updated Date - Jul 12 , 2024 | 03:38 AM