Share News

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:50 AM

Telangana: జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది.

TS News: న్యూఇయర్ వేడకల్లో ఘర్షణ.. కాంగ్రెస్ నేత మృతి

కామారెడ్డి, జనవరి1 : జిల్లాలోని నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో న్యూ ఇయర్ వేడుకల్లో ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్ నాయకుడిపై బీఆర్‌ఎస్ నాయకులు దాడి చేశారు. ఈ దాడిలో కాంగ్రెస్ నాయకుడు సాదుల రాములు (45) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు. రాములు మృతి పట్ల కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 01 , 2024 | 12:19 PM