Share News

TS news: కామారెడ్డిలో ప్రోటోకాల్ వివాదం

ABN , Publish Date - Mar 09 , 2024 | 04:13 PM

Telangana: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్ అని ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

TS news: కామారెడ్డిలో ప్రోటోకాల్ వివాదం

కామారెడ్డి, మార్చి 9: కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. ప్రారంభోత్సవానికి విశిష్ట అతిథిగా మహమ్మద్ అలీ షబ్బీర్‌ను ఆహ్వానించడం పట్ల కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి (Kamareddy MLA katipalli Venkataramana reddy) అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం రోజే ఆసుపత్రిని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. మధ్యాహ్నం ఆసుపత్రి అదనపు గదుల ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ రానున్నారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభోత్సవం చేయాలని సూచించిన ఎమ్మెల్యే ఆసుపత్రి బయటకు వెళ్లిపోయారు. అధికారులు, పోలీసుల తీరు పట్ల ఎమ్మెల్యే రమణారెడ్డి మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి...

TS Politics: రేవంత్ మొండిఘటం.. పోరాడి అధికారం సాధించుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ


AP Elections: టీడీపీ-జనసేన.. బీజేపీ పొత్తుపై కీలక అప్డేట్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 04:13 PM