Share News

Police Security: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:14 AM

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు.

Police Security: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భద్రత పెంపు

హైదర్‌నగర్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు భద్రతను పెంచారు. ఎమ్మెల్యే గాంధీని పీఏసీ చైర్మన్‌గా నియమించినప్పటి నుంచి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, గాంధీ మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా దాడుల వరకు వెళ్లింది. ఈ వివాదంపై కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేసుకుంటూ ఉండటంతో ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల మేరకు ఆదివారం ఉదయం నుంచిగాంధీ ఇంటి వద్ద భద్రతను భారీగా పెంచారు.


కూకట్‌పల్లి ఏసీపీ ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రత కల్పించారు. మధ్యాహ్నం మరో 100 మంది పోలీసులను మోహరించడంతో ఏం జరుగుతుందోనని స్థానికంగా అలజడి నెలకొంది. సాయంత్రానికి పోలీసు భద్రత మళ్లీ 50 మందితోనే కొనసాగింది.

Updated Date - Sep 16 , 2024 | 04:14 AM