Home » Security
రామేశ్వరం నగరాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ నెల 6వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం విచ్చేస్తున్న నేపథ్యాన్ని పురష్కరించుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ రాష్ట్రం హోషియార్పూర్లోని "విపశ్యన'' ధాన్య కేంద్రంలో బుధవారం నుంచి పదిరోజులు పాటు పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ట్రిప్ సైతం రాజకీయ విమర్శలకు దారితీసింది.
మార్చి 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని మార్గాల్లోనూ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలకు సాగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను అమిత్షా ఆదేశించారు. ప్రజల రాకపోకలను అడ్డుకోవడం, రోడ్ల దిగ్బంధనాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
భారతదేశ 76వ రిపబ్లిక్ డే(Republic Day) వేడుకలను ఈ నెల 26న ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రవాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధాని నగరం చెన్నైలో జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఐదంచెల భద్రత సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు ఢిల్లీలోనూ, అటు పంజాబ్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తు్న్నాయని, ప్రధానంగా కేజ్రీవాల్పై దాడి జరగవచ్చని అనుమానిస్తున్నారు.
Andhrapradesh: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు చేరాయి. ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీంకు శిక్షణ ఇస్తున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతుండంతో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితిని అమిత్షా సమీక్షించడంతో పాటు, ఎలాంటి పరిస్థితుల్లోనూ శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఆర్పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారు.
మిథున్ చక్రవర్తిని పాకిస్థాన్ గ్యాంగ్స్టర్ షాజాద్ బట్టి సోషల్ మీడియాలో బెదిరించాడు. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు 10 నుంచి 15 రోజుల లోపు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వీడియో మెసేజ్లో షాజాద్ బెదిరించాడు.
బీజేపీలో కీలక నేతగా ఉన్న సువేందు అధికారికి గతంలో 'జడ్' కేటగిరి భద్రత ఉన్నప్పటికీ అది పశ్చిమబెంగాల్ వరకే పరిమితం చేశారు. రాష్ట్రం దాటి ఎక్కడకు వెళ్లినా 'వై ప్లస్' కంటే తక్కువ భద్రత ఉండేది. దేశంలోని వీఐపీలకు గరిష్టంగా జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు( టీజీఎస్పీ) నిరసనల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం అయ్యారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం వద్ద భద్రతా సిబ్బందిలో కీలక మార్పులు చేశారు.