Share News

Loksabha Polls 2024: నేడు తెలంగాణకి రానున్న రాహుల్ గాంధీ

ABN , Publish Date - May 09 , 2024 | 08:43 AM

ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక ప్రచారాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీలు ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన అగ్ర నేతలంతా తెలంగాణలో సందర్శిస్తున్నారు.

Loksabha Polls 2024: నేడు తెలంగాణకి రానున్న రాహుల్ గాంధీ

హైదరాబాద్: ఎన్నికలకు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక ప్రచారాలు సైతం చివరి దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సవాల్‌గా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీలు ఎక్కువ ఎంపీ సీట్లను గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇరు పార్టీలకు చెందిన అగ్ర నేతలంతా తెలంగాణలో సందర్శిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. వీలైనన్ని ఎంపీ స్థానాలను కూడా గెలుచుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై ఫోకస్ పెట్టింది.

ఆ 48 గంటలు కీలకం అప్రమత్తంగా ఉండండి


నేడు రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రచారం చేయనున్నారు. నర్సాపూర్, సరూర్ నగర్ ఎన్నికల ప్రచార సభలకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జన జాతర సభలో రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు సరూర్ నగర్ స్టేడియంలో జరగనున్న జన జాతర సభలో రాహుల్, రేవంత్ పాల్గొననున్నారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఫుల్ జోష్‌తో పని చేస్తున్నారు. తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు బీఆర్ఎస్ నుంచి వలసలు పెద్ద ఎత్తున కాంగ్రెస్‌కు కొనసాగడం కూడా ఈ పార్టీకి కలిసి వస్తున్న అంశం.

ఇవి కూడా చదవండి..

PM Modi : అదానీ, అంబానీ నుంచి ఎంత ముట్టింది?

KCR : చిన్నపాటి వానకే పది గంటలు కరెంట్‌ పోతదా?

Read more Telangana News and Telugu News

Updated Date - May 09 , 2024 | 08:43 AM