Share News

Hyderabad: ట్యాపింగ్‌ నిందితుల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ..

ABN , Publish Date - Jun 28 , 2024 | 03:45 AM

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌ రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

Hyderabad: ట్యాపింగ్‌ నిందితుల బెయిల్‌ పిటిషన్ల తిరస్కరణ..

హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌ రావు బెయిల్‌ పిటిషన్లను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. 90 రోజుల జుడీషియల్‌ కస్టడీ ముగియడం, చార్జిషీట్‌ దాఖలు చేయనందున డీఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ముగ్గురు నిందితులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.


ఈ పిటిషన్లపై బుధవారం వాదనలు విన్న న్యాయమూర్తి వాటిరి తిరస్కరిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, నిబంధనల మేరకు 90 రోజుల్లో చార్జిషీట్‌ దాఖలు చేశామన్న దర్యాప్తు అధికారుల వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితుల బెయిల్‌ పిటిషన్లను తిరస్కరించారు.

Updated Date - Jun 28 , 2024 | 03:45 AM