Share News

Siricilla: సోనియాగాంధీకి పాలరాతితో గుడి

ABN , Publish Date - Jun 03 , 2024 | 04:24 AM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి కట్టి కాంగ్రెస్‌ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ నేవూరి మమత-వెంకట్‌రెడ్డి

Siricilla: సోనియాగాంధీకి   పాలరాతితో గుడి

  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సోనియాగాంధీ గుడి

  • సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్‌ నిర్మాణం

  • దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆవిష్కరణ

ఎల్లారెడ్డిపేట, జూన్‌ 2: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గుడి కట్టి కాంగ్రెస్‌ నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మాజీ సర్పంచ్‌ నేవూరి మమత-వెంకట్‌రెడ్డి సోనియాగాంధీకి పాలరాతితో గుడి నిర్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. పాలరాతితో గుడిని నిర్మించి అందులో సోనియాగాంధీ చిత్రపటం ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 03 , 2024 | 04:24 AM