Share News

Tirumala: శ్రీవారి సేవలో న్యాయమూర్తులు..

ABN , Publish Date - Oct 21 , 2024 | 05:09 AM

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రాజేశ్వరరావు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tirumala: శ్రీవారి సేవలో న్యాయమూర్తులు..

తిరుమల, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ రాజేశ్వరరావు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆయనకు రంగనాయకమండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.

Updated Date - Oct 21 , 2024 | 05:09 AM