Share News

Medaram Jatara 2024: ఇసుకేస్తే రాలనంత జనం.. అన్ని దారులు మేడారం వైపే

ABN , Publish Date - Feb 22 , 2024 | 10:38 AM

Telangana: దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్క జాతర భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగిన ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండటంతో మేడరం భక్తజనసంద్రంగా మారింది.

Medaram Jatara 2024: ఇసుకేస్తే రాలనంత జనం.. అన్ని దారులు మేడారం వైపే

మేడారం, ఫిబ్రవరి 22: దేశంలోనే రెండవ అతిపెద్ద జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమక్క-సారక్క జాతరకు (Medaram Jatara 2024) భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండటంతో మేడరం భక్తజనసంద్రంగా మారింది. ఉదయాన్నే జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను భక్తులు దర్శించుకుంటున్నారు. ఇసుకేస్తే రాలనంతగా మేడారం ప్రాంగణం జనంతో నిండిపోయింది. గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. మేడారం పరిసర ప్రాంతాలు గూడారాలతో పరుచుకున్నాయి. ఇప్పటికే సారలమ్మ గద్దెపై కొలువై ఉంది. ఈరోజు సాయంత్రానికి సమక్క ఆగమనం జరుగనుంది.

నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరుగనుంది. నిన్నటి నుంచి జాతర మొదలైంది. ఈనెల 24 వరకు జాతర జరుగనుంది. మొదటి రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు మేడారం గద్దెపైకి చేరడంతో మేడారం జాతరకు బీజం పడింది. ఆ తరువాత కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకువచ్చారు. ఆపై సమక్కను ఈరోజు చిలకలగుట్ట నుంచి సమక్కను తీసుకువస్తారు. అమ్మవార్లు గద్దెలపైకి చేరాక భక్తులు తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం చివరి రోజు అమ్మవార్ల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 22 , 2024 | 10:42 AM