Home » Medaram Jatara
గురువారం ఉదయం సూర్యోదయానికి ముందు పూజారులు వనదేవతల మందిరాలకు చేరుకొని తల్లులకు శనివారం వరకు అంతర్గత పూజాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక మినీ జాతర ప్రారంభమైన నేపథ్యంలో మేడారానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మండమెలిగె పండుగ సందర్భంగా తల్లుల గద్దెలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క- సారలమ్మల మినీ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం ఉదయం ప్రారంభమైంది. వడ్డెలు సమ్మక్క-సారలమ్మ కొలువైన మేడారం, కన్నెపల్లికి ద్వారా బంధనం చేసి జాతర ప్రారంభించారు. ఈ క్రమంలో ములుగు మన్నెంలో జాతరల సందడి నెలకొంది.
ములుగు జిల్లా: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతర బుధవారం నిర్వహించనున్నారు. మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలతో పాటు, ఛత్తీస్గఢ్ నుండి గుత్తి కోయలు, ఆదివాసీలు; జార్ఖండ్, మహారాష్ట్ర నుంచి గోండులు, కోయలు, లంబాడా; మధ్యప్రదేశ్ నుంచి బిల్లులు, రతీసాగర్ గోండులు; ఒరిస్సా నుంచి సవర ఆదివాసీలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తారు.
Medaram: ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజుల పాటు జరిగే జాతర కోసం మేడారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. 40 లక్షల మందికిపైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం.. అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 12న ఆలయ శుద్ది, పూజలు, గ్రామ నిర్బంధంతో సహా ఆచారాలు నిర్వహించనున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టిపెట్టింది. జాతరకు ముందు తాత్కాలిక సౌకర్యాలు కల్పించే ఆనవాయితీకి ఇక చెక్ పెట్టేసి.. భక్తుల కోసం శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలని సంకల్పించింది.
ఆరేళ్ల క్రితం ఈదురు గాలులు.. ఈ ఏడాది ఆగస్టులో పెను గాలులు. లక్షలాది భారీ వృక్షాలు నెలకొరిగాయి. డిసెంబర్ 4వ తేదీ భూప్రకంపనలు వచ్చాయి. ఇవన్నీ మేడారం అటవీ కేంద్రంగా జరుగుతున్నాయి. అసలు ఇంతకీ మేడారంలో ఏం జరుగుతుంది?
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం అటవీ ప్రాంతంలో బుధవారం భూ ప్రకంపనలతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గాలులకు లక్షలాది చెట్లు నెలకొరిగాయి. మళ్లీ అదే ప్రాంతంలో భూమి కంపించింది.
తిరుమలలో వెంకన్న, బెజవాడ దుర్గమ్మకు, యాదగిరీశుడికి, బాసరలో సరస్వతీ అమ్మవారికి.. ఇలా ప్రధాన ఆలయాల్లో కొలువై ఉన్న దేవుళ్లకు భక్తులు ఏటా సమర్పించుకుంటున్న బంగారం ఎంత?
మేడారం అభయారణ్యంలో సుడిగాలుల ప్రభావానికి 205 హెక్టార్లలో వృక్ష సంపద ధ్వంసమైన ఘటనను మరువక ముందే ఏటూరునాగారం మండలంలోనూ అదే తీరులో భారీగా వృక్షాలు నేలకూలాయి.