Share News

Konda Surekha: బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు

ABN , Publish Date - Jan 08 , 2024 | 10:10 PM

బీఆర్ఎస్ నేతలు ( BRS Leaders ) పదవి పోయిన ప్రస్టేషన్‌లో ఉన్నారని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) సెటైర్లు వేశారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చించారు.

Konda Surekha: బీఆర్ఎస్ నేతలు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు

హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు ( BRS Leaders ) పదవి పోయిన ప్రస్టేషన్‌లో ఉన్నారని మంత్రి కొండా సురేఖ ( Minister Konda Surekha ) సెటైర్లు వేశారు. సోమవారం నాడు పార్లమెంట్ ఎన్నికలపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. 7 పార్లమెంట్ స్థానాలపై MCRHRD‌లో సీఎం రేవంత్ చర్చించారు. ఈ సమావేశంపై మీడియాకు మంత్రి కొండా సురేఖ వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. వారానికి రెండు లేదా మూడు రోజులు.. రెండు లేదా మూడు గంటలు పార్టీ నేతలతో మాట్లాడుతామని సీఎం చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అధికారం కోల్పోవడం తట్టుకోలేక పోతున్నారు. ప్రజలు బీఆర్ఎస్ పాలన తట్టుకోలేక కాంగ్రెస్‌ను గెలిపించారు. వచ్చే టర్మ్ కూడా తామే అధికారంలోకి వస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 10:10 PM