Share News

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:57 AM

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Election Notification : మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్‌

అమరావతి, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం... (ఉత్తరాంధ్ర) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, గుంటూరు- కృష్ణా, ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన, 13న నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. మార్చి 8తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

Updated Date - Feb 04 , 2025 | 04:57 AM