Home » 2025
జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరం శుక్రవారం ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందడోలికల్లో మునిగితేలారు. అనంతపురం నగరంతోపాటు... బంజారాలు అధికంగా ఉండే తండాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో కాముడి దహనం కార్యక్రమాలు చేశారు. ఇస్కాన మందిరంలోనూ ...
ఆపద సమయాలలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శక్తి యాప్ గురించి విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ జగదీష్ పోలీసు అధికారులు, శక్తి టీమ్స్ను ఆదేశించారు. ప్రతి మహిళ తమ ఫోనలో శక్తి యాప్ను డౌనలోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందేలా చైతన్యపరచాలని సూచించారు. ఈ యాప్ ద్వారా హింసాత్మక ...
పట్టణంలోని ధర్మవరం గేట్ సమీపంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన విదేశీ పక్షి కోకాటైల్ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే పీట్ జోన దుకాణంలో విదేశీ పక్షిని విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారి అదేశాల ...
వేలు దొరకడం ఏమిటి..? చాన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్నాం కదా..! మళ్లీ ఏమైనా ఫ్యాక్షన గొడవలు జరిగాయా..? ఎవరైనా నరుక్కున్నారా..? అని కంగారు పడొడ్దు..! వేలంటే వేలు కాదు..! వేలు లాంటిది..! రబ్బరుతో తయారు చేసింది. రేషన బియ్యం వేసే సమయంలో.. కార్డుదారు లేకుండా, రబ్బర్ వేలును ఉపయోగిస్తున్నారన్నమాట..! ఆ వేలు.. పొరపాటున జారిపోయి.. బియ్యంలో ...
పట్టణం అంటేనే గుర్తొచ్చేవి ఇరుకు రోడ్లు, వాటిపైనే మురుగు ప్రవాహాలు, దుర్గంధం, ఎటుచూసినా చెత్తాచెదారం. పట్టణ ప్రజలు నిత్య నరకం అనుభవించేవారు. దశాబ్దాలుగా పట్టణ సమస్యలు అలానే ఉండేవి. గత వైసీపీ హయాంలో ఒకట్రెండు పనులు హడావుడిగా చేపట్టారు, అర్ధంతరంగా ఆపేశారు. దీంతో పట్టణ ప్రజలకు కష్టాలు తప్పలేదు. కూటమి అధికారం చేపట్టాక అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. ఎటుచూసినా రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు. రోడ్లపై మురుగు ..
స్థానిక సర్వజనాస్పత్రిలో దివ్యాంగ పింఛన రీ వెరిఫికేషనలో బోగ్సల ఆట కట్టించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కొందరు బోగ్సలు రీవెరిఫికేషనలో బయట బయోమెట్రిక్ వేసి.. లోపలికి వైకల్యం ఉన్నవారిని పంపించి డాక్టర్లను మస్కా కొట్టించి వైకల్యం ఉన్నట్లు ఆమోదం వేయించుకుంటున్నారు. ఆర్థో, దృష్టిలోపం పరీక్షల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు డాక్టర్లే గుర్తించి, అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారాలపై ‘రీ వెరిఫికేషనలో మాయగాళ్లు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం కథనం ప్రచురించింది. దీంతో ఉన్నతాధికారుల్లో చలనం వచ్చింది. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్ సైతం ఈ మోసాలపై ఆరాతీసి, సీరియస్ అయినట్లు తెలిసింది. దీంతో గురువారం వైకల్య సర్టిఫికెట్ల రీవెరిఫికేషన నిర్వహిస్తున్న ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక నిఘాచర్యలు తీసుకున్నారు. తొలుత వచ్చిన వారు రిజిస్ట్రేషన చేసుకున్న తర్వాత సీరియల్ నంబర్ కేటాయిస్తారు. దాని ఆధారంగా పేరు పిలిచి, వారికి బయట బయోమెట్రిక్ తీసి లోపలికి ...
వైసీపీ చేపట్టిన యువత పోరులో యువత పెద్దగా కనిపించలేదు. వైసీపీ నాయకులకే కాలేజీలు ఉన్నా.. విద్యార్థులు కూడా రాలేదు. విద్యార్థి, యువత సమస్యలపై పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో ‘యువత పోరు’ పేరిట కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అనంత వెంకటరామిరెడ్డి ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అనంత ...
నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు ఇవ్వాలని అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘మీ ఇంటికి-మీ ఎమ్మెల్యే’ కార్యక్రమం ద్వారా అనంతపురంలోని కాలనీల్లోకి తాను వెళుతుంటే డ్రైనేజీ సమస్యలు అత్యధికంగా తన దృష్టికి ...
నియోజకవర్గంలోని పురాత నమైన దేవాలయాల అభి వృద్ధితో పాటు గూగూడు ను పుణ్యక్షేత్రంగా, పర్యా ట క ప్రాంతంగా అభివృద్ధి చే యడానికి నిధులు కేటా యించాలని రాష్ట్ర దేవదా య శాఖ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి ఎమ్మె ల్యే బండారు శ్రావణిశ్రీ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే బుధవారం అసెంబ్లీ సమావేశాల అనంతరం మం త్రిని ఆయన కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఎస్సీ కాలనీకి సంబంధించిన దళిత శ్మశాన వాటిక ప్రహరీ, భవనం పనులు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాలనీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. శింగనమల ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు వైసీపీ ప్రభుత్వంలో చుట్టూ ప్రహరీ, భవనం నిర్మాణానికి ఎంపీ నిధులు రూ. 12 లక్షలు, ఏఆర్జీసీ నిధులు రూ. 7 లక్షలు చొప్పున మొత్తం రూ. 19 లక్షలు కేటాయించారు. వీటితో అక్కడ కాంట్రాక్టర్లు పనులు చేపట్టారు.