శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:25 AM
హైకోర్డు న్యాయమూర్తులు జస్టిస్ వీ.సుజాత, జస్టిస్ కే. సురే్షరెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్ కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

నరసరావుపేట, పెదకాకాని, అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపై త్రికోటేశ్వరస్వామిని, అమరావతిలోని అమరేశ్వరాలయాన్ని, పెదకాకానిలోని మల్లికార్జునస్వామి ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తులు పలువురు సందర్శించుకుని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. హైకోర్డు న్యాయమూర్తులు జస్టిస్ వీ.సుజాత, జస్టిస్ కే. సురే్షరెడ్డి, జస్టిస్ కృష్ణమోహన్ కోటప్పకొండలోని శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని మల్లేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గుణరంజన్, జస్టిస్ హరిహరనాథశర్మ దర్శించుకుని శివపార్వతులకు ప్రత్యేక పూజలు జరిపించారు. అమరావతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాలచాముండికా సమేత అమరేశ్వరాలయాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్తిహారి, జస్టిస్ జే సుమతి, జస్టిస్ సత్యప్రసాద్ సందర్శించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు.