Share News

Budget 2025: డెలివరీ సంస్థలో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:21 PM

Budget 2025: గిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.

Budget 2025: డెలివరీ సంస్థలో పనిచేస్తున్న వారికి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
Union Budget 2025

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: లోక్‌సభలో కేంద్రమంత్రి ఆర్థిక నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఇందులో భాగంగా గిగ్‌వర్కర్లకు కేంద్ర సర్కార్ శుభవార్త చెప్పింది. గిగ్‌ వర్కర్లకు ఈ-శ్రమ్‌ పోర్టల్‌ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.


దేశవ్యాప్తంగా అనేక డెలివరీ సంస్థల్లో ఎన్నో వేల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గిగ్ వర్కర్లు శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రప్రభుత్వ ప్రకటనతో గిగ్‌వర్కర్లకు ఈ బీమా ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి..

Union Budget: బడ్జెట్‌లో ఆ రాష్ట్రాలకు నిధుల వరద.. అసలు సంగతి ఏమిటంటే

గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 12:21 PM