Cyber Crime: కంపెనీలను వదలని సైబర్ నేరగాళ్లు.. ఏం జరిగిందంటే
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:03 PM
Cyber Crime: సైబర్ నేరగాళ్లు ఎప్పుడు ఎలా మోసానికి పాల్పడతారో తెలియని పరిస్థితి. ఇప్పటికే అనేక మంది సైబర్ మోసానికి బలయ్యారు. తాజాగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని భారీగా మోసపోయింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఇప్పటి వరకు మనుషులను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల కన్ను ఇప్పుడు కంపెనీలపై పడింది. పకడ్బందీగా ప్లాన్ చేసి ఇంతో ఈజీగా నమ్మిస్తూ డబ్బులు వసూలు చూసి మోసాలకు పాల్పడుతుంటారు సైబర్ నేరగాళ్లు. అలాగే కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతుంటారు. సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. సైబర్ నేరగాళ్ల మోసంతో కష్టపడి సంపాదించిన డబ్బులు మొత్తాన్ని క్షణాల్లోనే పోగొట్టుకుంటున్నారు బాధితులు. ఈ కేటుగాళ్ల ఉచ్చులో ఇప్పటికే అనేక మంది చిక్కుకున్నారు. ఎంతగానో అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఈజీగా సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడిపోతుంటారు కొందరు.
పోలీసులు సైబర్ నేరాల విషయంలో ఎన్ని మార్లు అవగాహన కల్పించినా.. పదే పదే మోసపోతూనే ఉన్నారు. తాజాగా వ్యక్తులనే కాదు.. ఏకంగా ఓ కంపెనీ కూడా సైబర్ నేరగాళ్ల గాలానికి చిక్కింది. నకిలీ ఈమెయిల్ ద్వారా కోట్లను కొల్లగొట్టారు కేటుగాళ్లు. ఎవరిది ఆ కంపెనీ.. ఏ విధంగా సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారో ఇప్పుడు చూద్దాం.
నకిలీ ఈమెయిల్తో...
ప్రముఖ మేఘా కంపెనీ సైబర్ నేరగాళ్ల మోసానికి బలైంది. నకిలీ ఈమెయిల్ ద్వారా దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. ఈ విషయాన్ని గుర్తించిన సదరు కంపెనీ... తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించింది. సైబర్ మోసంపై మేఘా సంస్థ అకౌంట్ మేనేజర్ శ్రీహరి... సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. అసలు కారణమిదే..
ఇదీ జరిగింది...
మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విమెంట్ను నెదర్లాండ్స్కు చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఆ కంపెనీ లాగానే ఈ మెయిల్లో ఒక అక్షరం మార్చి మెయిల్ చేశారు. కొన్ని కారణాల వల్ల మీరు పంపించే అకౌంట్ పనిచేయడం లేదు. మరో అకౌంట్కు డబ్బులు చెల్లించాలంటూ మేఘా కంపెనీకి మెయిల్ పంపించారు. అది నిజమని నమ్మి దాదాపు రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు కంపెనీ ప్రతినిధులు. అయితే అదే కంపెనీ నుంచి డబ్బులు చెల్లించలేదని మరో మెయిల్ వచ్చింది. దీంతో మోసపోయామని గ్రహించిన మేఘా కంపెనీ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ఫిర్యాదు చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
జైల్లో వల్లభనేని వంశీ చిందులు.. పోలీసులు సీరియస్.. ఏం చేశారంటే..
గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనెల ధరలు
Read Latest Telangana News And Telugu News