Home » Arrest
వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమెను గురజాలలో జడ్జి ఎదుట హజరు పరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విదిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆమెను గుంటూరు జైలుకు తరలించారు.
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
గత కొద్దిరోజులుగా నగరంలో కోట్లాది రూపాయలను కొల్లగిట్టిన సైబర్ నేరగాళ్లలో ఒకరిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మొత్తం రూ.2.01 కోట్లు కొల్లగొట్టిన ఆ సైబర్ నేరగాడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
కారు పార్కింగ్ విషయంలో బిగ్బాస్ ఫేమ్, నటుడు దర్శన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు న్యాయమూర్తి కుమారుడు, ఆయన భార్య, అత్తతో దర్శన్ గొడవకు దిగి వారిపై దాడికి పాల్పడ్డాడని అందిన ఫిర్యాదుతో పోలీసులు దర్శన్ను అరెస్ట్ చేశారు.
అరెస్టుల సమయంలో పోలీసులు హద్దులు దాటొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత డీజీపీలదని తెలిపింది
బీజేపీ ఎమ్మెల్యేలు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరి.. హెచ్సీయూ భూముల వద్దకు చేరుకుని అక్కడ బాధిత విద్యార్థులతోపాటుగా హెచ్సీయూ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలతో మాట్లాడేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. బీజేపీ ముఖ్యనేతలు బయటకు రాకుండా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
బ్రాండెడ్ పేరుతో నకిలీ ఆయిల్ అంటకడుతున్న వారి ఆట కట్టించారు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు. గత కొంతకాలంగా హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి. ప్రజల్లో కొంత అవగాహన లేమీతో ఈ తరహ మోసాలకు అంతే లేకుండా పోతోంది. అలాంటి మోసమే తాజాగా నగరంలో వెలుగుచూసింది.
తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కక్ష్యతో 10 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఎలక్ట్రిషన్ దస్తగిరి అనే వ్యక్తి న్యాయవాదిని హత్య చేశాడు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. మరోవైపు మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ..
మొఘులుల కాలం నాటి మసీదు రీసర్వే సందర్భంగా గత నవంబర్ 24న హింసాకాండ చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడిషియల్ ప్యానల్ను విచారణకు నియమించింది.
తప్పు చేసినవాడు ఎప్పటికైనా దొరకకపోడు అనే నానుడి అక్షరాలా నిజమైంది. పలువురిని మోసం చేసి దర్జాగా తిరుగుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. స్టార్టప్ కంపెనీలో పార్టనర్షిప్ ఇస్తానని పలువురిని నమ్మించి లక్షల్లో వసూల్ చేసి తప్పించుకు తిరుగుతున్న ఆర్థిక నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.